చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీ, నటులు ఉన్నారు. కానీ అందులో కొంత మంది మాత్రమే సహజ నటులుగా పేరు పొందారు. వారి నటన చూస్తే మన పక్కింటి వారే గుర్తుకు వస్తారు. అలాంటి వారిలో అలనాటి తార జయసుధ ఒకరు. అందుకే ఆమెకు సహజ నటి అనే బిరుదు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మా అధ్యక్షుడు మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
చిత్ర పరిశ్రమలో నటీ, నటుల సమస్యలను పరిష్కరించుకొవడానికి ఏర్పడ్డ సంఘమే ‘మా’. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్. ప్రస్తుతం ఈ సంఘానికి అధ్యక్షులుగా మంచు విష్ణు ఉన్నారు. మా ఎలక్షన్స్ ఎప్పుడూ వివాదాల నడుమనే జరుగుతాయని మనకు తెలుసు. ఈ సారికూడా అలానే జరిగాయి. అయితే తాజాగా విష్ణుపై నటి జయసుధ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మా’ అధ్యక్షులు విష్ణుపై ఆమె స్పందిస్తూ..” మా అధ్యక్షులుగా విష్ణు బాధ్యతలు తీసుకుని పది నెలలు కావొస్తుంది. అయినప్పటికీ అతను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ మధ్య ఒక మీటింగ్ అయితే పెట్టారు గానీ దాంట్లో మా భవనం గురించి ఏం మాట్లాడలేదని అమె అన్నారు. మా ఎన్నికల గొడవలు చాలా అసహ్యంగా ఉన్నాయని, అవి భరించలేకే ఆ సమయంలో నెల రోజులపాటు అమెరికాకి వెళ్లి అక్కడే ఉండి వచ్చానని జయసుధ అన్నారు. మా భవనం పూర్తి కావడానికి ఇంకో 25 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదని ఆమె అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మాటలు చెప్పేవారే కానీ పనులు మాత్రం ఎందుకు జరగడం లేదో తనకు అర్థం కావడం లేదంటూ మాట్లాడారు జయసుధ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ మరోసారి మా బిల్డింగ్ ఇష్యూని చర్చల్లోకి తీసుకొచ్చాయి. మరి జయసుధ వ్యాఖ్యలపై మంచు విష్ణు ఏవింధంగా స్పందిస్తారో చూడాలి. ‘మా’ పై అలాగే విష్ణుపై జయసుధ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.