Jayasudha: తెలుగు తెరపై ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణుల్లో జయసుధ ఒకరు. ఆమె తన అద్బుతమైన నటనకుగానూ ‘సహజ నటి’ అన్న బిరుదును తెచ్చుకున్నారు. 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో కొన్ని వందల సినిమాల్లో నటించారు. 1970-80లలో తెలుగు, తమిళం, మలయాళం పరిశ్రమల్లో టాప్ హీరోయిన్గా వెలుగొందారు. 1990ల నాటినుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్గా చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసినా.. ఆమె నటనలో ఎలాంటి మార్పు రాలేదు. అదే నటనను కొనసాగిస్తున్నారు.
జయసుధ తన 50 ఏళ్ల సినీ ప్రస్తానంపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ ఉందని అన్నారు. హీరో కంటే హీరోయిన్ను తక్కువ చేసి చూస్తున్నారని అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. ‘‘ 50 ఏళ్లంటే.. ఇదే బాలీవుడ్లో శుభాకాంక్షలు తెలిపేవారు. పూల బుకేలు పంపించేవారు. కానీ, ఇక్కడ పూల బుకేలు పంపిన వాళ్లు కూడా ఎవరూ లేరు. అదే ఓ హీరో అయితే ఇంకోలా ఉండేది.
చాలా మంది నాతో అన్నారు ‘ మీరెందుకు పెద్ద పార్టీ ఇచ్చి 50 ఏళ్లు కంప్లీట్ చేశానని చెప్పుకోవచ్చు కదా’ అని. నాకది వద్దు అనిపించింది. ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ ఉందేమో అనిపించింది. బాగా సక్సెస్ అయిన హీరోలను ఒకలా ట్రీట్ చేయడం. హీరోల కంటే హీరోయిన్లను తక్కువ చేసి చూడటం జరుగుతోంది. టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా అది ఉండింది. ఇప్పటివరకు ఉంది. హీరోల కంటే వారి పక్కన ఉండేవాళ్లు ఎక్కువ డ్రామా చేస్తారు.
హీరో సరిగ్గా డ్యాన్స్ చేయకపోతే.. మమ్మల్ని వచ్చి అడిగేవారు. నేనే కానీ, ఎక్కువ డిమాండ్లు పెట్టి, ట్రబుల్ చేసి ఉంటే.. ఇన్ని ఏళ్లు ఇండస్ట్రీలో ఉంచేవారు కాదు. పంపించేస్తారు. కానీ, ఎక్కడ కావాలో అక్కడ నా గొంతును వినిపించేదాన్ని’’ అని అన్నారు. మరి, ఇండస్ట్రీలో మేల్ డామినేషన్పై జయసుధ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Urvashi Rautela: ‘ది లెజెండ్ సినిమా’కి ఊర్వశీ రౌతేలాకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..!