దిల్ రాజు.. టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ప్రముఖ ప్రొడ్యూసర్గా పేరుంది. అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్, విజయ్ వంటి టాప్ హీరోలతో ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అవి కూడా పాన్ ఇండియా, హై బడ్జెట్ ప్రాజెక్టులే. ఇవి దాదాపుగా 2023లో విడుదల కానున్నాయి. దిల్ రాజులో ఉండే ప్రత్యేకత ఏంటంటే.. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఒక చిన్న డైరెక్టర్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీలు వంటివి కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్గా మారింది.
అదేంటంటే.. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించిన విషయం తేలిసిందే. ఆ తర్వాత ఆయన 2020లో తేజశ్వినిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వారికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ ఒకటి టాలీవుడ్ వర్గాల్లో వైరల్గా మారింది. అదేంటంటే.. తేజశ్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. అవును.. తేజశ్వినిని మోడల్గా పరిచయం చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. అలాగే ఆమెను సినిమాల్లోకి కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
దిల్ రాజు కంటే తేజశ్విని వయసులో చాలా చిన్న అని అందరికీ తెలిసిందే. అయితే పెళ్లికి ముందే తేజశ్వినికి మోడలింగ్ అంటే చాలా ఇంట్రస్ట్ అని.. కానీ, అప్పుడు ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని చెబుతున్నారు. అయితే వివాహం తర్వాత తన కోరికను భర్తకు వివరించగా.. దిల్ రాజు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తేజశ్వినిని మోడల్గా పరిచయం చేసేందుకు దిల్ రాజు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. హీరోయిన్గా లేదంటే సినిమాలో కీలక పాత్రలో కనిపించేలా ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే దిల్ రాజు భార్య మోడల్ కావడమే కాకుండా, ఆర్టిస్ట్ కూడా అయిపోతారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇంక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్తో ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ను ఒక ప్రభుత్వ అధికారిగా చూపించబోతున్నారని టాక్. అలాగే ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్కు 50వ మూవీ కావడం కూడా విశేషం. సినిమా ప్రారంభం సమయంలో రూ.170 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ అంతకుమించే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు దళపతి విజయ్తో వారీసు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దిల్ రాజుకు ఈ సినిమా విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.