స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి ఈ మధ్య టైం ఏమి బాగాలేనట్లుంది. 2020లో అల వైకుంఠపురంలో సినిమా వరకు వరుస బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకున్న ఈ ముంబై బ్యూటీ.. రెండేళ్లుగా వరుస ప్లాప్ లను మూటగట్టుకుంటోంది. అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాట్లేదు. 2022లోనే పూజా నుండి వచ్చిన మూడు సినిమాలు.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయాయి.
సినిమాల పరంగా ప్లాప్స్ వస్తున్నా.. అవకాశాల పరంగా పూజాకు ఎలాంటి కొదవ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ బోల్తా పడుతున్నా.. తెలుగులో అవకాశాలు తలుపు తడుతూనే ఉండటం విశేషం. ప్రస్తుతం పూజా చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు సర్కస్, కబీ ఈద్ కబీ దీవాలి ఉండగా.. తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండతో జనగణమన, పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలోనూ పూజానే హీరోయిన్.
ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ సినీవర్గాలలో వైరల్ అవుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో భవదీయుడు సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు పూజా తప్పుకుంది..? అనంటే.. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, ఆ తర్వాత తమిళ రీమేక్ వినోదయ సితం సినిమాలు లైనప్ చేశాడు. ఇలాగైతే పవన్ – హరీష్ సినిమా ఇంకా ఆలస్యమవుతుందనే ఆలోచనతో అమ్మడు తప్పుకుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.