సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. కానీ 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో నటించేవారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే అన్నట్లు ఉండేవి పరిస్థితులు. అయితే కాలం ఎంత మారినా సెలబ్రిటీలకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్లు స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరగలేరు.. మనలా షాపింగ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, సినిమా థియేటర్కు వెళ్లి సామాన్యుల మాదిరి సినిమా చూసి ఎంజాయ్ చేయడం వంటివి చేయలేరు. అందుకే విదేశాలకు చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేసి వస్తుంటారు.
ఇక సామాన్యంగా సెలబ్రిటీలు బయటకు వచ్చారంటే.. సొంత వాహానాల్లోనే వస్తారు. ఆటో, బస్సులో జర్నీలు చేయలేరు. వారికి ఆ అవకాశం కూడా ఉండదు. కానీ ఓ హీరోయిన్ మాత్రం.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకుని.. భాగ్యనగర వీధుల్లో.. ఆటోలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఒకప్పుడు వెండితెర మీద స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2007లో ఆమె వివాహం కాగా.. సుమారు 7 సంవత్సరాలు పాటు తెర మీద కనిపించలేదు. ఈ కాలంలో తన పాప బాగోగులు చూసుకుంటూ గడిపినట్లు తెలిపారు. ఆపై 7 ఏళ్ల గ్యాప్ తర్వాత దిక్కులు చూడకు రామయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు.
మరోవైపు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నారు ఇంద్రజ. పలు కార్యక్రామలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తన స్మైల్, మాట, డ్రెస్సింగ్ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఉండగా.. తాజాగా ఇంద్రజ భాగ్యనగర వీధుల్లో ఆటోలో ప్రయాణం చేశారు. కార్లో అయితే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని.. కూర్చోవాలని.. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఇలా ఆటోలో ప్రయాణించడం చాలా బాగుందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. ప్రసుత్తం అది తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.