క్రికెటర్స్ కి సినిమా హీరోలు అభిమానులుగా ఉండటం అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ.. సినీ హీరోలకే క్రికెటర్స్ ఫ్యాన్స్ అయిపోవడం అనేది ఫ్యాన్స్ కి కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా క్రికెట్ ఆడి దేశం పేరును ప్రపంచదేశాలకు విస్తరించేలా చేస్తుంటారు క్రికెటర్స్. దీంతో సినీ హీరోలే వారికి ఫ్యాన్స్ అవుతుంటారు. అయితే.. క్రికెటర్స్ కూడా ఓ మంచి సినిమా చూసినప్పుడు, ఓ నటుడి నుండి గొప్ప నటనను ఎంజాయ్ చేసినప్పుడు అభిమానాన్ని బయట పెడుతుంటారు. ఆదివారం ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ గెలుపు అనంతరం పలువురు క్రికెటర్స్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసినట్లు తెలుస్తుంది.
ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియాల మధ్య ఫైనల్ టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు. అయితే.. మ్యాచ్ అయిపోగానే ఇండియన్ క్రికెటర్స్ కొందరు రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. చరణ్ ని కలిసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాలతో పాటు ఇంకొంత మంది వెళ్లినట్లుగా సమాచారం.
ఇక హీరో రామ్ చరణ్ ని క్రికెటర్స్ కలిశారని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధాలు లేకుండా పోయాయి. దీంతో రామ్ చరణ్ తో క్రికెటర్స్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. చరణ్ ని పక్కాగా ఎవరెవరు కలిశారని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన ‘రామరాజు’ క్యారెక్టర్ చూసి పాన్ ఇండియా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు చరణ్ ని క్రికెటర్స్ కలవడం అనేది వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Indian Cricket Players met #RamCharan at his residence!#HardikPandya #ViratKohli #IndianCricketTeam
— Team RamCharan (@AlwayzRamCharan) September 26, 2022
ViratKohli, HardikPandya, SuryaKumarYadav and Few Other Young Players Interacted with #RamCharan𓃵 Till Morning👌🏻 at his Residence @AlwaysRamCharan @imVkohli @hardikpandya7 @surya_14kumar https://t.co/6JSVQgwxKq
— Johnnie Walker (@roopezh) September 26, 2022