ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా గుండెపోటు కారణంగా చాలా మంది సెలబ్రిటీలు మృతి చెందారు. ఇక తాజాగా ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదంతో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజ సోదరుడు అన్నయ్య పావలార్ వరదరాజన్ రెండో కొడుకు పావలర్ శివన్ (60) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతితో ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే పావలర్ శివన్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పావలర్ గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నాటక రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇక పాలర్ శివన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పావలర్ శివన్ తన కుటుంబంతో కలిసి పుదుచ్చేరిలో నివసిస్తున్నారు. ఆయన ఫేమస్ గిటారిస్ట్. కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్గా పనిచేస్తున్నారు.
ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావలార్ వరదరాజన్ చాలా మద్దతుగా నిలిచారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. పావలార్ వరదరాజన్ గేయ రచయిత మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు కూడా. ఇళయరాజా అన్నయ్య పావలార్ వరదరాజన్ 1973లో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులుండగా.. ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించారు. ఇక తాజాగా మరో కుమారుడు పావలర్ శివన్ మే 2న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పావలర్ శివన్ రెండు, మూడు చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు.
బుధవారం అనగా మే 3న పావలర్ శివన్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. పావలర్ అంత్యక్రియలలో ఇళయరాజా, యువన్శంకర్రాజా, కార్తీకరాజా, గంగై అమరన్, వెంకట్ ప్రభు, ప్రేమ్జీ అమరన్, భవధరణి పాల్గొననున్నట్లు సమాచారం. శివన్ మంచి గిటారు వాయిద్యకారుడు. ఆయన ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతూ వచ్చారు. అంతేకాక సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాలకు పని చేశారు. కానీ అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శివన్ కుటుంబ సభ్యులతో కలసి పాండిచ్చేరిలోనే ఉంటున్నారు. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అన్న కొడుకు మృతి పట్ల ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.