ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచిన దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. దేశం గర్వించతగ్గ చిత్రం తీసి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని దేశవిదేశాల్లో నిలబెట్టిన ఘనుడు రాజమౌళి. అసలు ఇండియా నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరో మెట్టు పైకి ఎక్కారు. మెల్లగా సినిమా రేంజ్ ని, ఆడియన్స్ రేంజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా.. అన్ని సినిమాలు లేవు, ఉన్నది ఒకటే సినిమా అది ఇండియన్ సినిమా అని రాజమౌళి చాటి చెప్పారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ సినిమా స్టామినా ఏంటో నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుని.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రాజమౌళి ఏ సినిమా చేసినా, తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి ఉంటుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు సినిమా సినిమాకి రాజమౌళి ఆలోచనా విధానం ఎదిగిపోతుంది. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈసారి తీయబోయేది పాన్ వరల్డ్ మూవీ అంటున్నారు. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ ఫిల్మ్ సిరీస్ ని బేస్ చేసుకుని రాబోతుంది.
ఇటీవలే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైన సందర్భంగా రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాహుబలి మూవీకి జపాన్ లో మంచి ఆదరణ లభించిందని, తాను ఎంచుకునే కథలు తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయని నమ్మకం ఉండేది కానీ దేశం దాటి వెళ్తాయని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. అలాంటిది బాహుబలి సినిమాకి జపాన్ లో వచ్చిన ఆదరణ చూసిన తర్వాత తనకి నమ్మకం ఏర్పడిందని అన్నారు. దీంతో తూర్పు దేశాల ప్రజలకు తెలుగు సినిమాలు నచ్చుతాయని అనుకున్నారట రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వెస్టర్న్ దేశాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీయలేదని.. అయితే అక్కడ వారికి కూడా ఈ సినిమా తెగ నచ్చిందని అన్నారు.
హాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది కదా అని వారి కోసం తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని వారికి తగ్గట్టు సినిమాలు చేస్తే అవి వర్కవుట్ అవుతాయనుకోనని అన్నారు. ఈ ఆలోచనా విధానమే తనను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన విధానం, ఓన్ స్టైల్ ఉందని.. తన సొంత స్టోరీ టెల్లింగ్ కి కట్టుబడి ఉంటానని, కాకపోతే బెటర్ గా, తనను తాను ఇంప్రూవ్ చేసుకోవాలన్న విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటానని అన్నారు. తనకి, తన సినిమాలకి చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకునే సినిమాలు చేస్తానని అన్నారు. అల్టిమేట్ గా తనకున్న ప్రేక్షకులను సంతృప్తిపరచడమే అంతిమ లక్ష్యమని రాజమౌళి అన్నారు. ఇక మన దేశంలోని మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే.. రామాయణ, మహాభారత ఇతిహాసాల మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఎక్కువ సినిమాలు తీసిందని అన్నారు. వీటిలో ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఉన్నాయని అన్నారు.
రామాయణ, మహాభారత ఇతిహాసాలను బేస్ చేసుకుని సినిమాలు చేస్తే గనుక.. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కావని, ఆ సినిమాలు రాష్ట్రాలు, దేశాలు దాటి ప్రేక్షకులను సంపాదించుకుంటాయని అన్నారు. బాహుబలి విషయంలో అదే జరిగిందని, అది అన్ని అడ్డంకులను బద్దలుకొట్టిందని అన్నారు. నెమ్మదిగా ప్రజలు భారతదేశం అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని, ఇంకా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయని, ముఖ్యంగా ఇండియన్ సినిమా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని రియలైజ్ అవుతున్నారని, అది నా ఇండస్ట్రీ అని రాజమౌళి గర్వంగా చెప్పారు. మరి రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.