ఎన్సీపీ అధినేత శరద్ పవర్ అభ్యంతరక వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యి జైలు పాలైన మరాఠీ నటి కేతకీ చితలే పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న తనపై భౌతిక దాడి చేశారని, తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో పాటు నిర్భంధించి.. లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తాజాగా పోలీస్ కస్టడీ ముగిసిన అనంతంర కేతకీ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు వివరాల్లోకి వెళ్తే..
కొన్ని నెలల క్రితం శరద్ పవార్ కు వ్యతిరేకంగా కేతకీ చితలే.. తన ఫేస్బుక్లో ఓ వివాదస్పద పోస్టు చేసింది. “నరకం ఎదురుచూస్తుంది..బ్రాహ్మణ ద్వేషి” అంటూ శరత్ పవార్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై పలు స్టేషన్లలో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. పవార్ మద్ధతుదారుల ఫిర్యాదుతో ఈ ఏడాది మే 14 పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేతకీపై మహారాష్ట్రలో మొత్తం 22 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. గత నెలలో అరెస్ట్ అయిన కేతకీ చితాలేకు థానే కోర్టు జూన్ 22న బెయిల్ మంజూరు చేసింది.
తాజాగా పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం కేతకీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైలు పాలు చేశారు. లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా కొట్టారు అని ఆమె తెలిపారు. తనను చట్టవిరుద్ధంగా జైలు పాలు చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకీ చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు. మరి.. నటి చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జబర్దస్త్ రీతూ.. అందాల రచ్చ! కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే!