తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో.. ఇటీవలే 75 వారాలను పూర్తిచేసుకుంది. జబర్దస్త్ సుధీర్ యాంకరింగ్ తో ప్రారంభమైన ఈ షోని గత కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తోంది. ఇక ప్రతివారంలాగే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈసారి షోలో గెస్టులుగా ‘తీస్ మార్ ఖాన్’ మూవీ హీరో ఆది, హీరోయిన్ పాయల్ రాజపుత్ హాజరయ్యారు.
ఇక ఎప్పటిలాగే ప్రోమో అంతా సందడిగా సాగింది. హైపర్ ఆది, రష్మీ, రాంప్రసాద్ లతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకుంది. అయితే.. హైపర్ ఆది వేసే పంచుల గురించి తెలిసిందే. హీరో ఆది, పాయల్ లతో హైపర్ ఆది మాట్లాడుతుండగా పూర్ణ జోక్యం చేసుకొని.. “హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నాడు, హీరో ఆది చాలా క్వైట్ గా ఉంటాడు” అని చెప్పింది. ఇంతలో హైపర్ ఆది అందుకొని.. ‘పూర్ణ హనీమూన్ బాగా జరిగిందా?’ అని అడిగాడు. దీంతో పూర్ణ వెంటనే తలదించుకుంది.
షో టైంలో ఎవరు ఎక్కడ దొరికినా హైపర్ ఆది వదలడనే విషయం విదితమే. జడ్జిగా వచ్చిన పూర్ణని హనీమూన్ గురించి ప్రశ్న అడిగేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే పూర్ణ ఇటీవలే తాను ఎంగజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లి కూడా కాకుండా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని హైపర్ ఆది పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి పూర్ణను హైపర్ ఆది అలా అడగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.