ఖరీదైన కారు – టాక్స్ మినహాయింపు …ధనుష్ పిటిషన్!
మధ్యతరగతి ప్రజలు ఇలా కోరుతున్నారా…
కూలి పనులు చేసుకునే వారు సబ్బుకు పన్ను కడుతున్నారు…
కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు టాక్స్ పే చేయరు –
మద్రాస్ హైకోర్టు ఆగ్రహం…!!!
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు వాహనాలకు పన్నులు చెల్లించేందుకు ప్రముఖులు మినహాయింపులు కోరుతుండడం, కొన్నిసార్లు పన్ను ఎగవేతకు పాల్పడు తుండడం తరచుగా మీడియాలో దర్శనమిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే కోర్టుతో మొట్టికాయలు తిన్నాడు. మరో తమిళ హీరో ధనుష్ కూడా తన ఫారెన్ కారుకు పన్ను మినహాయింపు కోరి, హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. ధనుష్ రోల్స్ రాయల్స్ కారు కొనుగోలు చేసిన విషయంలో దిగుమతి టాక్స్ రద్దు చేయాలనీ కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సామాన్య మానవుడు ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు. ఇక కోట్లు సంపాదించే సినీ నటుడు ఎందుకు టాక్స్ పే చేయరని ప్రశ్నించింది. ఎంత ఖరీదైన కారు కొన్నా రోడ్డుమీదనేగా నడిపేది ఆకాశం లో కాదు అంటూ వ్యాఖ్యానించింది. మధ్యతరగతి ప్రజలు మీలాగే టాక్స్ లనుండి మినహాయింపు కోరుతున్నారా. వీఐపీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఎందుకు టాక్స్ మినహాయింపు విషయాలలో కోర్ట్ ని ఆశ్రయిస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటువంటి పిటిషన్ వేయమని క్లయింట్ అడిగినప్పుడు న్యాయవాదులు పిటిషనర్ కి టాక్స్ ఎందుకు పే చేయాలో వివరించాల్సిన బాధ్యత లేదా అని జడ్జి ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కారుకి టాక్స్ మినహాయింపు కోరుతూ నటుడు విజయ్ హైకోర్టు ని ఆశ్రయించగా జడ్జి ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.