మోడలింగ్ ప్రపంచంలో.. మరీ ముఖ్యంగా అందాల పోటీల్లో మిస్ ఇండియా పోటీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పోటీల్లో విజేతగా గెలిచిన వారు.. ప్రపంచ వేదిక మీద మిస్ వరల్డ్ పోటీల్లో.. భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు. అయితే ఈ పోటీల నిర్వహణను కొందరు వ్యతిరేకించినా.. చాలా మంది మాత్రం.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. కిరీటం దక్కించుకోవాలని ఆశిస్తారు. అంతటి క్రేజ్ ఉంది ఈ పోటీలకు. ఇప్పుడు ఇంత సడెన్గా ఈ మిస్ ఇండియా పోటీల ప్రస్తావన ఎందుకు వచ్చిందటే.. ఈ సారి తెలుగు రాష్ట్రం తరఫున ఈ మిస్ ఇండియా పోటీల్లో హీరోయిన్ శివానీ రాజేశేఖర్ పాల్గొనబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: KGF-2 ఫేమ్ ‘కలాష్నికోవ్’ రైఫిల్ గురించి మీకు తెలుసా..?
సీనియర్ హీరో డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె, నటి శివాని ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్కు హాజరైనట్టు సోషల్ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు తెలిపింది. దాంతో పాటు తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని.. దానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది.
ఇది కూడా చదవండి: ‘కార్తీకదీపం’ సీరియల్ పై ఆటో డ్రైవర్స్ ఫైర్!‘ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు సైతం ఆల్ ది బెస్ట్’ అని శివాని తెలిపింది. గత ఏడాది ‘అద్భుతం’ అనే చిత్రంతో శివాని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘శేఖర్’ చిత్రంతో వెండితెరపై తండ్రి రాజశేఖర్తో కలిసి తొలిసారి నటించింది శివాని. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మిస్ ఇండియాలో పాల్గొంటున్న శివానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: జబర్దస్త్ కు హైపర్ ఆది గుడ్ బై చెప్పాడా..?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.