గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలు, దేశవిదేశాల్లోని మనుషులను కరోనా మహహ్మారి మార్చేసిందని ఈటీ కథానాయకుడు సూర్య తెలిపారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చిందని అన్నారు. ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ని విడుదల చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో ఈటీ చిత్రం గురించి, పాండమిక్ గురించి, భారత చలన చిత్ర రంగం గురించి పలు విషయాలను ముచ్చటించారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘‘ఈటీలో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఈటీ సినిమా. రాజమౌళి, ఆయన ఫాదర్ విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఈటీలోనూ విలన్ సరికొత్తగా వుంటాడు. ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇప్పటి జనరేషన్ కూడా బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. నా అభిమానులు కూడా నా కథలు, నన్ను బాగా ఫాలో అవుతున్నారు. వారిని మెప్పించే సినిమా ఈటీ’’ అని తెలిపారు.