దగ్గుబాటి రానా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన హుటాహుటిన అమెరికాకు పయనం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా రానా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చికిత్స నిమ్మిత్తం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన ఈ సమస్యపై ఎన్నో సార్లు చికిత్స కూడా తీసుకున్నాడు. రానా అమెరికాకు వెళ్లిన నేపథ్యంలో ఆయన అభిమానులు తెగ టెన్షన్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే రీమెక్ సినిమాలో నటిస్తున్నారు.
రానా విదేశాలకు వెళ్లటంతో సినిమా షూటింగ్ను కూడా వాయిదా వేసుకున్నట్లు ఫిల్మ్నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి నిజంగానే రానా అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక రానా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలో దర్శనమిచ్చారు రానా.
దీంతో పాటు ఆయన నటించిన వీరాటపర్వం అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో రానాకు జోడిగా హీరోయిన్ సాయపల్లవి నటించింది. ఆమెతో పాటు ప్రముఖ హీరోయిన్ ప్రయమణి భారతక్క అనే పాత్రలో నటిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి.