టాలీవుడ్ లో సహాయపాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. హీరోగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల్ని పలకరించి, ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా ’18 పేజెస్’తో థియేటర్లలోకి వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. తన గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలంటే చాలాకష్టాలు పడాలి. తెలిసివాళ్లుంటే చిన్న చిన్న పాత్రలైనా సరే దక్కొచ్చు. అదే బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణించాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక సదరు హీరోలు లేదా హీరోయిన్స్ స్టార్ అయిపోయి, ఓ స్టేజీకి వెళ్లిన తర్వాత ఆ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిఖిల్ కూడా అలాంటి దాని గురించే రివీల్ చేశాడు. తనని కొందరు సినిమా పేరు చెప్పి మోసం చేశారని అన్నాడు. తన డబ్బులు కూడా పోయావని అసలు విషయాన్ని వెల్లడించాడు.
‘అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత ఓ సీరియల్ లోనూ నటించాను. అక్కడే ఉంటే బుల్లితెరకు పరిమితమవుతాననిపించింది. దీంతో సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. కొందరికి నా యాక్టింగ్ నచ్చి అవకాశాలిస్తామని చెప్పేవారు. ఆ తర్వాత పట్టించుకునేవారు కాదు. ఇంకొందరేమో నిన్ను హీరోగా చేయాలా? రూ. 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకురా అనేవారు. నేను హీరో కావడానికి రూ.5 లక్షలు ఇచ్చాను కూడా. కొన్నిరోజులు షూటింగ్ చేసి ఆపేశారు. దీంతో అది ఫేక్ అని అర్ధమైంది. శేఖర్ కమ్ముల చాలా జెన్యూన్. నా యాక్టింగ్ నచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని భద్రంగా దాచుకున్నాను. ఆ మూవీ తర్వాతే నాకు వరసగా అవకాశాలు వచ్చాయి. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటూ ఉంటాను’ అని నిఖిల్ తన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు. మరి నిఖిల్ చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటనేది దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.