సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు చాలామంది. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్లే విభేదాలతో విడిపోతున్నారు. టాలీవుడ్ నే తీసుకుంటే నాగచైతన్య-సమంత విడిపోవడం ఫ్యాన్స్ కి చాలా బాధ కలిగించింది. ఆ విషయం పక్కనబెడితే హీరో ధనుష్-ఐశ్వర్య విడాకుల వార్త కూడా అభిమానుల చాలా బాధపడేలా చేసింది. అయితే ఈ జంట త్వరలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ ఇండస్ట్రీలోకి హీరోగా ధనుష్, కెరీర్ ప్రారంభంలో పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్దరూ 2004లో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్లకు యాత్ర, లింగా అనే ఇద్దరబ్బాయిలు కూడా ఉన్నారు. ఇక ఐశ్వర్య కూడా ‘త్రీ’ సినిమాతో దర్శకురాలిగా మారింది. అందులో ధనుష్ హీరోగా నటించడం విశేషం. అలాంటి వీళ్లిద్దరూ ఈ ఏడాది జనవరిలో సడన్ గా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోయారు.
అయితే ధనుష్-ఐశ్వర్య మధ్య ఉన్నవి చిన్న చిన్న గొడవలేనని.. వీరిద్దరూ మళ్లీ కలుస్తారని, పెద్దలందరూ వారితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ధనుష్ తండ్రి కస్తూరిరాజా కొన్నాళ్ల క్రితం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే రజనీకాంత్, ధనుష్ పేరెంట్స్ అందరూ ఈ జంటని కూర్చోబెట్టి మాట్లాడారని.. పిల్లల కోసమైనా సరే ఇద్దరూ కలిసి ఉండాలని చెప్పారట. దీంతో ధనుష్-ఐశ్వర్య కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో విడాకుల నిర్ణయాన్ని రద్దు చేయనున్నారట. దీంతో ధనుష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది.. ధనుష్ చేసి మారన్, ది గ్రే మ్యాన్, తిరు, నేనే వస్తున్నా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘సార్’ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. మరి ధనుష్-ఐశ్వర్య విడాకుల రద్దు వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.