కొరటాల శివ తెలుగు లో తీసినవి కొన్ని చిత్రాలే అయినా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో టీం బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్ లతో దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది.
ఈ సందర్భంగా మూవీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు చిత్ర బృందం. ఆచార్య ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో నుంచి డైలాగ్ ను లీక్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.
డైరెక్టర్ హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ మాట్లాడటం అందరినీ ఆకర్షించింది. ఈ మూవీలో పవన్ గురించి ఏ రేంజ్ లో చెప్పడో అర్థం అవుతుంది. ‘మొన్న వీడు మన ఇంటికి వచ్చి అరిస్తే… ఏంటి వీడి ధైర్యం అనుకున్నా. ఇప్పుడు అర్దమైంది… వీడు నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు. ఇదే వీడి ధైర్యం అనుకుంటా’ అని విలన్ అనగా, పక్కనే ఉన్న మరో వ్యక్తి ‘కాదు… ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అనే ధైర్యం’అని చెప్తాడు అంటూ హరీష్ శంకర్ డైలాగ్ ను లీక్ చేసేశారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ రేంజ్ డైలాగ్ తో అదరగొట్టిన హరీష్ శంకర్ మూవీ ఏ రేంజ్ లో తీస్తాడో అని ఫ్యాన్స్ తెగ సంతోషంలో ఉన్నారు.