తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూశారు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబంలో నెలల వ్యవధిలోనే మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోకముందే సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
సూపర్ స్టార్ కృష్ణ ఆయన చివరిరోజులు నానక్ రామ్ గూడాలో ఉన్న ఇంట్లో గడిపారు. మహేష్ బాబు, నమ్రతా వారి పిల్లలు వీక్ ఎండ్ వస్తే అక్కడికి వెళ్లి కృష్ణతో సరదాగా గడిపేవారని ఇండస్ట్రీలో టాక్. మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార అంటే కృష్ణకు ఎంతో ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణ తనకు గౌతమ్ కృష్ణ అంటే ఎంతో ప్రేమ అని.. చాన్స్ వస్తే తన మనవడితో కలిసి నటించాలని పలు సందర్భాల్లో తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే. అలాగే తాతయ్య కృష్ణ అంటే గౌతమ్ కృష్ణకు ఎంత ప్రేమనో అతని ఎమోషనల్ పోస్ట్ చూస్తే అర్థం అవుతుంది.
‘మీరు ఎక్కడ ఉన్నప్పటికీ.. నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా.. నన్ను కూడా మీరు ప్రేమిస్తూనే ఉంటారని నాకు తెలుసు.. నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను.. ఐ మిస్ యూ తాతగారు’ అంటూ తాతయ్య కృష్ణ, చెల్లి సితార ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసి ఘట్టమనేని అభిమానులు, నెటిజన్లు ఎంతో ఎమోషన్ అవుతున్నారు.
నిన్న ఘట్టమనేని సితార తన తాతయ్య కృష్ణ జ్ఞాపకాలతో ఒక పోస్ట్ చేసింది. ‘వీక్ ఎండ్స్ లో ఎప్పటిలాగా లంచ్ ఉండదు.. నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పించారు.. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు.. నువ్వే నా హీరో.. మీరు గర్వించే స్థాయికి చేరుకుంటా.. ఐ మిస్ యూ తాతగారు’ అంటూ తాత కృష్ణతో దిగిన ఫోటో షేర్ చేసింది సితార. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార, గౌతమ్ కృష్ణ ఎమోషనల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.