కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తీక్, కోలీవుడ్ బ్యూటీ మంజిమ మోహన్.. ఇద్దరూ ఇవాళ ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు వీరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Wishing Our Beloved Gautham Karthik sir and Manjima Mohan ma’am, a very happy married life 🧬❤️🤗🎊🎉💞
Wishes from entire team of @StudioGreen2 @Gautham_Karthik @mohan_manjima #GauthamKarthik #ManjimaMohan #StudioGreen #KEGnanavelRaja pic.twitter.com/Df4aHjIqxN
— Studio Green (@StudioGreen2) November 28, 2022
ఇక కెరీర్ విషయానికొస్తే.. మంజిమ మోహన్ తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటించింది. గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కాదల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కార్తీక్. తెలుగులో నాని, నిత్యామీనన్ నటించిన అలా మొదలైంది సినిమాని అక్కడ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. 2019లో వచ్చిన దేవరట్టం సినిమాలో గౌతమ్ కార్తీక్ సరసన మంజిమ మోహన్ నటించింది. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది, అది కాస్తా ముదిరి ప్రేమగా మారింది. మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ పక్షులు ఇవాళ వివాహ బంధంతో ఒకటయ్యాయి.
Favourite ❤️ #GauthamKarthik #ManjimaMohan #Couple #CoupleGoals #Love pic.twitter.com/dvr9AsXGmv
— Gautham Karthik’s Srilankan Fan (@gauthamfan) November 28, 2022