ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచం స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేయడంతో టాలెంట్ ఉన్న వాళ్ళ పని సులువు అయిపోయింది. ఒకప్పుడు ప్రతిభ చూపించుకోవాలంటే కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగడమో లేక ఎవరైనా గుర్తించే వరకూ ఎదురుచూడడమో జరిగేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరి సపోర్ట్ లేకపోయినా ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటే డిజిటల్ దునియాని ఏలేయచ్చు. ఈ విషయాన్ని చాలా మంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారి నిరూపించారు. ఒక ప్యాషన్ తో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి.. ఎంటర్టైన్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ.. సెలబ్రిటీలుగా ఎదుగుతారు. సినిమా వాళ్లకేం తీసిపోని విధంగా వీళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఏమైనా అయితే ఫ్యాన్స్ తట్టుకోలేరు.
టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన మేఘా ఠాకూర్ కెనడాలో ఉంటుంది. వీడియోలతో ఫ్యాన్స్ ని అలరించే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకారణంగా మృతి చెందింది. అప్పటి వరకూ వీడియోలతో అలరించిన టిక్ టాక్ స్టార్ నుంచి అప్ డేట్స్ లేవు, వీడియోలు లేవు. ఏమైంది అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అందరికీ ఊహించని విధంగా షాకిస్తూ ఆమె నవంబర్ 24న మరణించింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు మేఘా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. నవంబర్ 24 ఉదయాన మా జీవితాలకు వెలుగు, అందమైన కూతురు మేఘా ఠాకూర్ ఊహించని విధంగా, అకస్మాత్తుగా తమని వదిలివెళ్ళిపోయిన విషయాన్ని బరువెక్కిన హృదయాలతో చెబుతున్నాము.
మేఘా చాలా కాన్ఫిడెంట్ మరియు స్వతంత్రంగా ఉండే యువతి. ఆమె తన ఫ్యాన్స్ ని ఎంతగానో ప్రేమించేది. ఆమె మరణం నుంచి తెలియాలని కోరుకుంది. ఈ సమయంలో ఆమెకు మీ ఆశీస్సులు ఉండాలి. మీ ఆలోచనలు, ప్రార్థనలు ఆమె ప్రయాణంలో తనతో పాటే ఉంటాయి’ అంటూ వెల్లడించారు. మేఘా అంత్యక్రియలు నవంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ నిర్వహించారు. టిక్ టాక్ లో 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మేఘా ఠాకూర్ కి 4 నెలల క్రితమే గుండెపోటు వచ్చింది. అప్పుడు తనకు ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉండేవని.. అందుకే గుండెపోటు వచ్చినట్లు ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. టిక్ టాక్ ద్వారా బాడీ పాజిటివిటీ గురించి అవగాహన కల్పిస్తూ పోస్టులు పెట్టే మేఘా ఠాకూర్ ఇలా తమని వదిలిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఖరి వీడియో నవంబర్ 19న అప్ లోడ్ చేసింది.