దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో విభిన్నమైన మండపాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. అయితే ఒడిశాలోని జయపురం పట్టణంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నవరాత్రుల సందర్భాంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుండా స్జేజ్ పైనే ప్రముఖక గాయకుడు మురళీ మహోపాత్రో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. దీంతో అక్కడకి వచ్చిన ముఖ్య అతిధులు, అభిమానులు ఒకసారిగా షాక్ గురయ్యారు.
ఒడిశాలోని జయపురం పట్టణంలో దసరా ఉత్సవాలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా నిర్వాహకులు వివిధ సాంష్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జయపురంలోని రాజ్ మహల్ కూడలి వద్ద సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, మున్సిపల్ ఛైర్మన్ నరేంద్రకుమార్, జిల్లా సబ్ కలెక్టర్ దేవధర ప్రధాన్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు మురళీ మహోపాత్రో తన బృందంతో కలిసి పసందైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు. అలా తన తోటి గాయకులు పాడుతుండగా.. పక్కనే ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారు.
అయితే కొద్ది సమయం తర్వాత ఆయనకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆయన కూర్చీ మీద నుంచి స్టేజీపై ఒరిగిపోయారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్నారు షాకయ్యారు. కొద్ది సమయానికి తేరుకుని నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే స్థానిక ఆస్పత్రికి రలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. అందరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం దురదృష్టకరమని ఆ ఈవెంట్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు.