దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్లో జరుపుకుంటోంది. ఇక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు సినిమా యూనిట్. దీంతో సమయం దొరికినప్పుడల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉక్రెయిన్ విధుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ ఇటీవల విడుదల చేసి దోస్తీ సాంగ్ను వింటున్న వారి ఇద్దరి వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది.
ఇందులో ఆ పాటను అనుసరిస్తూ ఇద్దరు పాడుతూ కారులో తిరుగుతున్నారు. ఇక ఉక్రెయిన్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఈ ఇద్దరు బాడా హీరోలు. ఇక చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో త్వరలో విడుదల సిద్దమవుతోంది. ఇక తాజాగా విడుదల చేసిన దోస్తీ సాంగ్ నెట్టింట్లో సూపర్బ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్ – శ్రియ – సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.