బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాకి నిత్యం ఏదో ఒక రకంగా స్టఫ్ ఇస్తా ఉంటుంది. ఆ మధ్య తన కోరిక తీర్చమని ఏకంగా ప్రభాస్ కి ప్రైవేట్ మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చి మంచి స్టఫ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అతిలోక సుందరి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందాన లైఫ్ యమా జోరుగా సాగిపోతుంది. అందుకే తనకి ఇంత సక్సెస్ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు తిరుమల వెళ్ళింది. తిరుమలలో శ్రీవారికి మొక్కు చెల్లించుకుంది. తనకి సక్సెస్ వస్తే కాలి నడకన తిరుమల వస్తానని మొక్కుకుందట. ఊహించని విధంగా సక్సెస్ రావడంతో ఇవాళ ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల చేరుకుని.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది. ఆలయ అధికారులు ఆమెను పట్టువస్త్రాలతో సత్కరించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దివి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కు తీర్చుకున్నానని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆమె తెలిపింది. దేవుడి చల్లని ఆశీస్సులతో ప్రస్తుతం 3 సినిమాలు లైన్లో ఉన్నాయని, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నానని, కొత్త సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని దివి వెల్లడించింది. ఆ విధంగా తనకి సక్సెస్ నిచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది బిగ్ బాస్ దివి.