పిరియాడికల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ మార్చి 11 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు.
ప్రపంచ వ్యాప్తంగా 10వేల థియేటర్లకు పైగా మార్చి 11న భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూల్ స్టార్ గా మారి నటించిన సినిమా కాగా.. రిలీజ్ దగ్గరపడుతున్న క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వూలో దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
STAY TUNED TO @BrutalRebelismm SPEACIAL POSTER DESIGN TODAY AT 6.00PM#RadheShyam #Prabhas#RadheShyamOnMarch11 pic.twitter.com/C5duJlcMSk
— World Of Prabhas™ (@_WorldOfPrabhas) February 26, 2022
రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంటనే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి.. ప్రభాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారని.. తన పోషిస్తున్న విక్రమాదిత్య పాత్రలో ఉన్న విభిన్న షేడ్స్ విషయంలో ప్రభాస్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి నటించారని రాధాకృష్ణ చెప్పాడు. నిజానికి రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామనుకున్నా.. కానీ ప్రభాస్ గారు ఇచ్చిన సూచనలతో ఇటలీ బ్యాక్ డ్రాప్ కి మార్చానని.. అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువల్ ఎస్సెట్ గా మారిందని చెప్పుకొచ్చాడు.
కోవిడ్ కి ముందు ఇటలీ, ఇతర యూరప్ దేశాల్లో షూట్ చేశామని.. కోవిడ్ కారణంగా వచ్చిన ఆంక్షలుతో ఇటలీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేశామనేంతగా.. భారీ సెట్స్ మధ్య రాధేశ్యామ్ షూటింగ్ జరిగిందని చెప్పాడు. జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హానెస్ట్ గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ గా మారుతుందని చెప్పుకొచ్చాడు. రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి జోతిష్యం చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్రభాస్ నటించగా.. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇదేనని చెప్పుకొచ్చారు.
Director #RadhaKrishna spills the beans about #RadheShyam! ❤️#RadheShyamOnMarch11#Prabhas #ThamanS #PoojaHegde @director_radhaa @UV_Creations #TeluguFilmNagar pic.twitter.com/b7gH9Nj0rS
— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2022
ఇక, సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వాలనే మార్చేసే అంత శక్తిగా సోషల్ మీడియా తయారైందని.. అన్ని చిత్రాల ప్రమోషన్స్ కి మీడియాతో పాటు సోషల్ మీడియా అవసరమని చెప్పాడు. రాధేశ్యామ్ ని థమన్ తన అద్భుతమైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారని.. ప్రభాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడముచ్చటగా.. రొమాంటిక్ గా ఉంటుందని, రాధేశ్యామ్ లో మెజార్టీ విజువల్ ఎఫెక్ట్స్ ఉక్రెయిన్ లో చేయించామని.. అన్ని సకాలంలోనే పూర్తి చేశామని చెప్పారు.
#RadheShyam getting the biggest ever release in the USA for an Indian film. Premieres on 10th March 2022. pic.twitter.com/mH3Ognwdn0
— Aakashavaani (@TheAakashavaani) February 25, 2022