Anasuya: గోపీచంద్ హీరోగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ పక్కా కమర్షియల్’. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా, గోపీచంద్, మారుతీలు సినిమా ప్రమోషన్కోసం ప్రముఖ కామెడీ షో ‘జబర్థస్త్’కు వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ యాంకర్ అనసూయపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనసూయ పక్కా కమర్షియల్ అని అన్నారు. జబర్థస్త్ స్టేజిపై మారుతీ మాట్లాడుతూ.. ‘‘ ఓ పక్కా కమర్షియల్ యాంకర్ను కలుద్దామని వచ్చాం ఇవాళ. మామూలు కమర్షియల్ కాదు ఈవిడ! చిన్న చిన్న పాత్రలు చేయదు ఇచ్చినా..’’ అని అనసూయను ఉద్ధేశిస్తూ అన్నారు. మారుతీ ఈ మాటలు అంటున్నపుడు అనసూయ ఆయనను మాట్లాడకుండా నోరు మూయటానికి ప్రయత్నించింది.
అయితే, మారుతీ ఈ మాటలు నవ్వుతూనే అన్నారు. అయినప్పటికి మారుతీ మాటల్లో నిజం లేకుండా పోతుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ‘పక్కా కమర్షియల్’ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. బన్నీ వాసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జేమ్స్ బిజోయ్ సంగీతం అందించగా.. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమా కోర్టు రూమ్ యాక్షన్ కామెడీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి, డైరెక్టర్ మారుతీ, అనసూయపై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి : Anasuya: అనసూయ డ్రెస్సింగ్పై దర్శకుడి ఓపెన్ కామెంట్స్.. ఆమెను అలా చూడటమే ఇష్టం!