మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా సరే తన ప్రతి సినిమాకు చాలా కష్టపడుతుంటారు. అందుకే విజయాల్ని దక్కించుకుంటూ ఉంటారు. ఎందరో నటులు, దర్శకులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇక చిరు సెట్ లో ఉన్నారంటే చాలా క్రమశిక్షణతో ఉంటారని పలువురు డైరెక్టర్స్ పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇక సెట్ లో ఏ చిన్నపొరపాటు జరిగినా సరే అస్సలు సహించరు. నిర్మాతల శ్రేయస్సే తనకు ముఖ్యమని చిరు కూడా వివిధ సందర్భాల్లో చెప్పారు. అలా సెట్ లో అన్నయ్య చిరంజీవి చేసిన పని గురించి ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ బయటపెట్టాడు.కుర్చీ విసిరికొట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ విషయం చెప్పిన డైరెక్టర్ బాబీ!
ఇక విషయానికొస్తే.. మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా తాజాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమాతో పాటు పలు విషయాల గురించి అందరూ మాట్లాడారు. అలా మెగాస్టార్ కు కోపం వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని డైరెక్టర్ బాబీ బయటపెట్టారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నారు. కుర్చీ విసిరేసి వెళ్లిపోతున్న మెగాస్టార్ ని చాలా దూరం నుంచి చూశానని చెప్పాడు.
‘సెట్ లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ నిర్మాతకు రూపాయి నష్టం వచ్చే పనిచేసినా లేదా సినిమాకు ఇబ్బంది వచ్చే ఏ విషయమైనా ఆయన దగ్గరికి తీసుకెళ్లకపోతే.. ఆయనకు కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్ లో ఆయనలోని శివుడిని చూశాను. షాట్ కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయాను. ఛైర్ విసిరేసి.. మీ బోడి.. ఈ ఫెర్ఫార్మెన్స్ నా దగ్గరొద్దు. నేను తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్ అని ఛైర్ విసిరేసి వెళ్లిపోతున్న మెగాస్టార్ ని నేను దూరం నుంచి చూశాను. దీంతో వాల్తేరు వీరయ్య సెట్ లో అలా ఇబ్బంది తేకూడాదని ప్రయత్నించాను.’ అని బాబీ షూటింగ్ టైంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.