ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమని మరణాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మూవీ క్రిటిక్ కౌశిక్ అకాల మరణం పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేయగా ప్రస్తుతం మరో విషాదం ఇండస్ట్రీని చూట్టుముట్టింది. ఇప్పటికే ఈ సంవత్సరం పలువురు నటులను, టెక్నీషియన్లను కోల్పోయిన చిత్ర పరిశ్రమ తాజాగ మరో ప్రతిభావంతమైన ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక నిర్మాతను కోల్పోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్.. ప్రముఖ సినిమాటోగ్రఫర్, దర్శక నిర్మాత, రచయిత కూడా. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన శుక్రవారం నాడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతోనే మరణించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ‘ఆ నలుగురు’ చిత్ర దర్శకుడు అయిన చంద్ర సిద్ధార్థుకు సోదరుడు అవుతాడు. తెలుగులో ‘నిరంతరం’ (1995) అనే మూవీకి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆ రోజుల్లోనే కైరో ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రాజేంద్రప్రసాద్ హలీవుడ్ లో ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’ ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు స్వయంగా కథ రాసుకోవడమే గాక సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. తెలుగులో మేఘం, హీరో లాంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు.
హిందీ సినిమాలు చేసే క్రమంలో ఆయన ముంబైలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాడ సాను భూతి తెలిపారు. మరి ఇండస్ట్రీలో వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.