దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా దిల్ రాజు కొనసాగుతున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగారు. ప్రస్తుతం మోస్ట్ సక్సెఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. దిల్ రాజు సినిమా అంటేనే హీరో ఎవరు అనే విషయం పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్లు క్యూ కడుతుంటారు. అంతలా ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దిల్ రాజు. ప్రస్తుతం విజయ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో వారసుడు సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా ఇష్యూ నడుస్తోంది. ఈక్రమంలో ఇండస్ట్రీపై దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉండాలి అంటే సిగ్గు,మానం,నీతి వంటివి లేకుండా ఉండాలనే అర్ధం వచ్చేలాగా దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీ గురించి పలు విషయాలను వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో ఎవరూ తోపు కాదని, ఎవరూ పెద్ద కాదని, సినిమాని ఎవరూ శాషించలేరని తెలిపారు. చివరికి తనకు కూడా అది సాధ్యం కాదని, ఇక్కడ ఎవరి దారి వారిదేన్ని దిల్ రాజు అన్నారు. తాను నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేయడం దుమారం రేపుతున్నాయి. ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ..” సినిమా అనేది ఓ రంగుల, మాయ ప్రపంచమని, అసలు చూడకుండానే కొనే వస్తువు అంటే సినిమానే. డిస్ట్రిబ్యూటర్ దొరికితే హీరో పేరు చెప్పి సినిమాలను అమ్మేస్తారు. ఇక్కడ ఇంకో దారుణం ఏమిటంటే.. డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రేక్షకులతో పాటే థియేటర్లోనే సినిమా చూసుకునే పరిస్థితి ఉంది.
డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ తగ్గిపోవడానికి కారణం ఇదే.ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబ అని బయటకు చెప్పడానికే ఉంటుంది, కానీ ఎవరి దారి వారిదే. నేను నిర్మాతగా మారిన కొత్తలో వరుసగా పరాజయాలు చవిచూశాను. చాలా సార్లు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అప్పట్లోనే కోటీ రూపాయలు నష్టపోయాను కానీ ఇప్పుడు లాభాల్లోనే ఉన్నాను. దిల్రాజు అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఓ బ్రాండ్గా ఏర్పడింది. నేనంటే చాలా మందికి అసూయ ఉంటుంది. అలానే నేను అంటే, పడని వారు నాపై ఏదో ఒక వివాదం సృష్టిస్తుంటారు” అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు.
ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ..హీరోల పారితోషకం, సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఆలోచించుకోవాలని పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. భారీ వసూలు వచ్చినప్పటికీ , నిర్మాణం ఖర్చు ఎక్కువ కావడంతో నిర్మాతకు నష్టాలో మిగులుతున్నాయని తెలిపారు. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతుందని దిల్ రాజు అన్నారు. తనతో పాటు వేరే బిజినెస్ లో చేసిన తన బ్యాచ్ ఎక్కడికో ఎదిగిపోయారని తాను మాత్రం ఇక్కడే ఉన్నానని తెలిపారు. ఇక్కడ కేవలం గుర్తింపు, సెలబ్రిటీ అనే హోదా మాత్రమే ఉంటుందని ఇంకేమి ఉండవని తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.