టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’. మిస్టరీ థ్రిల్లర్ గా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇటీవలే థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కృష్ణతత్వానికి, సైన్స్ ని.. అడ్వెంచర్స్ ని ముడిపెట్టి రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇక మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన కార్తికేయ 2.. విడుదలైన మూడో రోజే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి రూ. 2 కోట్ల ప్రాఫిట్ సాధించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో కార్తికేయ 2 టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. కార్తికేయ 2 సినిమా విడుదలకు ముందు తనపై వచ్చిన ఆరోపణలు, రూమర్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కార్తికేయ 2 బిగ్ హిట్ అయినందుకు చిత్రయూనిట్ ని అభినందించిన దిల్ రాజు.. అనంతరం మాట్లాడుతూ.. “నేనొక విషయంపై క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఎప్పటికి నాకు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది.
ఈ సినిమా రిలీజ్ ముందు నుండే నిఖిల్ కి, నాకు మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇండస్ట్రీలో మాకేదో యూనిటీ లేదనుకుంటారు. ప్రొడ్యూసర్స్ అంతా ఒక్కటై మేం రిలీజ్ గురించి, క్లాషెస్ గురించి మాట్లాడుకుంటాం. ఈ లోపలే ఎవ్వడికి తోచింది వాడు.. సినిమాలను తొక్కేస్తున్నారని రాస్తున్నాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ సినిమాలను తొక్కుకోరు. అది రాసేవాళ్లకు, చదివే వాళ్లకు, వినేవాళ్లకు ఉండాల్సిన మినిమమ్ కామన్ సెన్స్. మాకిక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం.
మీ క్లిక్స్ కోసం, మీ సబ్ స్క్రైబర్స్ కోసం మాలో మాకే ఏదో క్రియేట్ చేస్తూ.. మమ్మల్ని బలి పశువులను చెయ్యొద్దు. ఇంతకుముందు కూడా నామీద ఇలాంటివి చాలా వచ్చాయి. ఓపిక పడుతూ వచ్చాను. ఎవడైనా సినిమాను తొక్కుతాడా? కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలి. వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి. దయచేసి వాస్తవాలు తెలుసుకొని రాయండి. తెలియకుంటే మూసుకోండి” అంటూ ఎమోషనల్ అయ్యాడు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి దిల్ రాజు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.