మిడిల్ క్లాస్ హీరో పాత్రలు అనగానే ఇతడే గుర్తొస్తాడు. ఈ మధ్యే ‘తిరు’ సినిమాతో మరోసారి అలాంటి రోల్ లో కనిపించి హిట్ కొట్టాడు. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించాడు. సినిమాల పరంగా తమిళ నుంచి హాలీవుడ్ వరకు తన స్టామినా చూపించిన ధనుష్… గత కొన్నాళ్ల నుంచి వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయమే తమిళ మీడియాలో తెగ వస్తోంది. విడాకుల వార్తకు ఇది అప్డేటెడ్ న్యూస్. దీంతో అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 18 ఏళ్ల క్రితం హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2004 నవంబరు 18న వీళ్ల మ్యారేజ్ జరిగింది. ఈ జంటకు యాత్ర రాజా, లింగ రాజా అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘త్రీ’ సినిమాలో ధనుష్ హీరోగానూ యాక్ట్ చేశాడు. వరల్డ్ ఫేమస్ ‘వై దిస్ కొలవెరి’ సాంగ్.. ఈ సినిమాలోనిదే. అలా అన్యోన్యంగా ఉన్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు.
ఇక ఇది జరిగి చాలా కాలమైపోయింది. కట్ చేస్తే.. ధనుష్-ఐశ్వర్య విడాకులు రద్దు చేసుకుని మళ్లీ కలిసిపోతారనే న్యూస్ బయటకొచ్చింది. దీనిపై ఈ ఇద్దరిలో ఎవరూ రియాక్ట్ కాలేదు. ధనుశ్ తండ్రి కస్తూరి రాజా పరోక్షంగా స్పందించారు. ధనుష్ కి తన పిల్లల సంతోషమే ముఖ్యమని అన్నారు. దీంతో విడాకుల రద్దు వార్తలు నిజమేనని నెటిజన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇదంతా కాదన్నట్లు ధనుష్.. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేయనున్నాడని.. ఇందులో భార్య ఐశ్వర్య, పిల్లలతో కలిసి ధనుష్ ఉండబోతున్నాడని తమిళ మీడియాలో వస్తోంది. మరి ఇందులో నిజమెంత? ఏంటి సంగతి తెలియాలంటే మాత్రం అసలు విషయం బయటకొచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. మరి ధనుష్-ఐశ్వర్య విడాకుల రద్దు, కొత్తింటికి మకాం వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు.. ఆ హీరోయినే కారణమంటున్న నెటిజన్లు..