హనీరోజ్.. ఈ మలయాళ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డిలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల క్రష్ గా మారిపోయింది. ఆమెను సోషల్ మీడియాలో కుర్రాళ్లు తెగ ఫాలో అయిపోతున్నారు. కొత్త పిక్ పెట్టీ పెట్టగానే లైకులు కొట్టేస్తున్నారు. అయితే ఆమెకు ఇప్పుడు తెలుగులో ఇంత ఫాలోయింగ్ వచ్చింది కానీ.. ఆమె గతంలోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని చాలా మందికి తెలియకపోవచ్చు. అవును.. హనీరోజ్ దాదాపు 14 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయినగా నటించింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఆ తెలుగు సినిమా గురించి వెతుకులాట మొదలు పెట్టారు.
వీరసింహారెడ్డి సినిమాలో హనీరోజ్ నటన, అందం, అభినయం, స్మైల్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఆమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా యాడ్ చేసుకున్నారు. నిజానికి హనీరోజ్ కి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ వచ్చింది. కానీ, ఆమె 14 ఏళ్ల క్రితమే టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసింది. కాకపోతే అప్పుడు ఆమెకు అంత గుర్తింపు, ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదు. కాబట్టి ఆ సినిమా పేరు ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు హనీరోజ్ గురించి అందరూ వెతుకున్న నేపథ్యంలో అప్పట్లో ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిందనే విషయం వెలుగు చూసింది.
అయితే ఆమె నటించింది మరెవరితోనే కాదు.. హీరో శివాజీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. 2008లో శివాజీ సరసన ఆమె ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఆ రోజుల్లోనే రూ.రెండున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి ఊహించినంత్ ఆదరణ దక్కకపోవడంతో హనీరోజ్ గురించి కూడా ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు కాస్త దూరమైందనే చెప్పాలి. అయినా వీర సింహారెడ్డి వరకు ఆమెకు తెలుగులో సైరన అవకాశం దక్కలేదు.
హనీరోజ్ తన 14 ఏట నుంచే యాక్టింగ్ మొదలు పెట్టింది. 2005లోనే ఆమె తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది. తర్వాత 2008లో ఆలయం సినిమాలో నటించింది. తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా కూడా చేసింది. అది కూడా ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది. తర్వాత ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల తర్వాత హనీరోజ్ మళ్లీ తెలుగులో వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిచింది. ఇప్పుడు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. ఈమె మలయాళంలోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.