ఒకప్పుడు తెలుగు, హిందీ సహా ఇతర భాషల చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అనంతరం హీరోగా అంత సక్సస్ఫుల్ రాణించలేకపోయారు. కానీ వ్యాపారవేత్తగా మాత్రం సత్తా చాటారు. కొంతకాలం గుట్కా వ్యాపారాన్ని కూడా నడిపారు. కానీ అతనిపై చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో జైలుకు కూడా వెళ్లారు సచిన్ జోషీ
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద మొత్తం 410 కోట్ల రూపాయలు బ్యాంకు నిధులను మళ్లించారన్న ఆరోపణలు సచిన్ జోషీపై ఉన్నాయి. దీంతో 2021 ఫిబ్రవరి 14న జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రత్యేక PMLA కోర్టు సచిన్ జోషికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.అలాగే పాస్పోర్టును ఈడీకి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇక సచిన్ జోషీకి బెయిల్ మంజూరు చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.