సినిమాల్లో నటించాలని, వెండితెర మీద తమ కలర్ ఫోటో చూసుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. బిగ్ స్క్రీన్ మీద అవకాశం రాబట్టుకోవాలంటే ముందు బుల్లి స్క్రీన్ మీద మనమేంటో నిరూపించుకోవాలని ఎంతోమంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తామేంటో నిరూపించుకుంటున్నారు. అలా నిరూపించుకున్న వారిలో అచ్చ తెలుగందం వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం కొట్టేసింది. షణ్ముఖ్ జస్వంత్ సరసన ‘సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్’ అనే వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్శించింది.
దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించి మెప్పించింది. ఆ తర్వాత అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలిమై’ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్యకు.. హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. అయితే ఇండస్ట్రీ అన్నాక చిన్నచూపు చూడడం, చులకనభావం, అవమానం వంటివి సహజమే కదా. ఈ వైష్ణవి తేజకు కూడా అలాంటి అవమానమే జరిగింది.
షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే నీకెందుకే హీరోయిన్ వేషం అంటూ కొంతమంది అవమానించారట. ఇక దర్శకుడికైతే కొంతమంది ఈ అమ్మాయిని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకోమని సలహా ఇచ్చారట. బేబి టీజర్ లాంఛ్ లో భాగంగా వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేష్ భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ. “వైష్ణవిని నా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నప్పటి నుంచి.. ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టావ్. యూట్యూబ్ లో ఆల్రెడీ చాలా మంది చూసేశారు. ఇన్స్టాగ్రామ్ లో అందరూ చూసేశారు. ఎందుకు పెడుతున్నావ్? ఇంకెవరూ దొరకలేదా?” అని అనేవారని రాజేష్ అన్నారు. నిజానికి వైష్ణవి చైతన్య చాలా బాగుంటుందని, వైష్ణవి ఎంత బ్రిలియంట్ యాక్ట్రెస్సో సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు.
“అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలిగా చేయడం చూసేశాం, షార్ట్ ఫిల్మ్స్, ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చూశాం. కానీ లోపల ఏదో ఉంటుంది కదా. తన మీద నమ్మకంతో కథ చెప్తున్నప్పుడు తను హీరోయిన్ గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. రేపు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు” అంటూ సాయి రాజేష్ వైష్ణవిపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేరే హీరోయిన్ ని తీసుకోవచ్చు కదా అన్నారంటే.. వైష్ణవి చైతన్య స్థానంలో ఎవరైతే వైష్ణవిని వద్దంటున్నారో.. వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ లో ఉన్న హీరోయిన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారేమో.
లేదంటే అంత పర్టిక్యులర్ గా వద్దు అనడం ఏమిటి? వైష్ణవి చైతన్యపై కుట్ర కాకపోతే ఏమిటి? ఇది తొక్కేయడం కాదా? అని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వైష్ణవి.. డీ గ్లామర్ రోల్ లో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. హృద్యమైన ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన కలర్ ఫోటో సినిమాలో నటులు కూడా స్టార్ క్యాస్ట్ కాకపోయినా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు బేబీ కూడా స్టార్ క్యాస్ట్ కాకపోయినా అందరినీ ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.