కమెడియన్ పృథ్వీ..30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కామెడియన్గా బాగా క్లిక్ అయ్యాడనే చెపాలి. పృథ్వీ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికీ దాదాపుగా 75 సినిమాల్లో నటించిన మంచి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి పృథ్వీ సినిమాల్లో కాస్త కనిపించటం లేదనే చెప్పాలి. కాగా ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న సమయంలో పృధ్వీ రాసలీల ఆడియో టేప్ ఒకటి బయటకు రావటంతో ఆయన అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు.
దీంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఎక్కడ కూడా కనిపించని పృథ్వీ చాలా కాలమే గ్యాప్ తీసుకున్నాడు. అయితే తాజాగా సంపూర్ణేష్ బాబు హీరోగా బజార్ రౌడి సినిమాల్లో నటించారు కమెడియన్ పృథ్వీ. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో పృథ్వీ తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్లపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
యాంకర్ ఇలా అడుగుతూ..ఏంటి సినిమా ప్రమోషన్లో మీ సినిమా హీరో, హీరోయిన్ రారా అనే ప్రశ్నకు..పృథ్వీ ఇలా సమాధానమిచ్చాడు. ప్రమోషన్లో సాధారణంగా హీరో, హీరోయిన్లు ఉండాలి, కానీ మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఏంటంటే..? హీరోయిన్లు ఎక్కడో బాంబేలో ఉంటారు. మాములు అయితే ఉండాలని తెలిపారు. హీరోలైతే షూటింగ్ల్లో బీజీగా ఉంటారు గనుక వారు రాలేరని తెలిపాడు పృథ్వీ.