ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు సినీ ప్రముఖులే కాకుండా ఇటు రాజకీయం ప్రముఖుల సైతం స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల విఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021