సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం కాబట్టి ఎప్పుడూ ఏదొక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. హీరో హీరోయిన్స్ లేదా దర్శకులు ఇలా ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు వివాదంలో చిక్కుకొని వార్తలకు మెయిన్ పాయింట్ అవుతుంటారు. అయితే.. గతంలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వార్తలు విన్నాం. ఎందరో హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు మీడియా ముందు చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఎప్పుడైతే ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయం బయటపడిందో అప్పటినుండి దాని ప్రభావం హీరోయిన్స్ లేదా లేడీ ఆర్టిస్టులపై తగ్గిందని చెప్పాలి. కానీ.. ఎక్కడో చోట ఏదొక విధంగా కాస్టింగ్ కౌచ్ కంటిన్యూ అవుతుందని నమ్ముతుంటారు.
ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్ కంటే దారుణమైన పనికి ఒడిగట్టేందుకు ఓ దర్శకుడు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ పై ఓ బాధితుడు పెట్టిన ఫిర్యాదు కారణంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఓ నటి మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను మానభంగం చేస్తానని సదరు డైరెక్టర్ బాధితుడిని బెదిరించిన విషయం ఇండస్ట్రీలో అందరినీ షాక్ కి గురిచేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని రామాపురం పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక భారతీ వీధికి చెందిన ఎంఎస్ ప్రభు దాదాపు ముప్పై సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ గా పని చేసుకుంటున్నాడు. అయితే.. 2006లో ఇతనికి ఏఎల్ సూర్య అనే దర్శకుడితో పరిచయం ఏర్పడినది. ఇక నటి పద్మప్రియకు సంబంధించి ఓ వీడియో విషయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది.
ఈ నేపథ్యంలో కొంతకాలం తర్వాత దర్శకుడు సూర్య.. తనకు పద్మప్రియను పరిచయం చేయాల్సిందిగా ఎంఎస్ ప్రభును అడిగాడు. అందుకు ప్రభు ఏమి స్పందించకపోవడంతో.. దర్శకుడు తెగించి పద్మప్రియతో పరిచయం కాదు.. ఏకంగా ఆమె నెంబర్ ఇవ్వాలని ప్రభుని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. పద్మప్రియ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యను మానభంగం చేస్తానని ప్రభును బెదిరించే ప్రయత్నం చేశాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్న ఈ ప్రభు, దర్శకుడు సూర్యల కేసులో మరి తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి రామాపురం పోలీసులు దర్శకుడు ఏఎల్ సూర్యపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.