ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్ది సేపటి క్రితం మృతిచెందారు. న్యూమోనియాతో బాధపడుతూ హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ఆయన మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సీతారామశాస్త్రి మృతిలో భావోద్వేగానికి గురైన చిరంజీవి.. ఆయన ట్విట్టర్ అకౌంట్లో స్పందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన సూపర్హిట్ మూవీ రుద్రవీణా సినిమాకు సాహిత్యం అందించిన సందర్భంగాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
‘సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు pic.twitter.com/dcRFE4XPXn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021
నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు.
మిత్రమా … will miss you FOREVER !#SiriVennela #SirivennelaSeetharamaSastry pic.twitter.com/HJKsBNvQ4J— Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021