సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదా సంపాదించుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలైన పాట.. జంబలకడి జారు మిఠాయి. మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలో ఈ పాట ఉంటుంది. అయితే సినిమాలో కన్నా కూడా.. ఈ పాటను స్టేజీ మీద పాడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు భారతమ్మ, నాగరాజమ్మ. వీరి వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కొన్నిరోజుల పాటు ఎక్కడ చూసిన ఈ పాట, దీని మీద ట్రోల్స్. విమర్శల సంగతి పక్కన పెడితే.. ఈ పాట ద్వారా భారతమ్మ, నాగరాజమ్మలకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇప్పటికి ఈ పాట హవా కొనసాగుతోంది. ఇక తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం.. జంబలకడి జారు మిఠాయి పాట పాడారు. చిరు నోట ఈ పాట విని అభిమానులు షాకవుతున్నారు. వామ్మో ఈ రేంజ్లో పాట వైరలయ్యిందా అని ఆశ్చర్యపోతున్నారు.
మరి చిరంజీవి.. ఈ పాట ఎక్కడ పాడాడు.. ఎప్పుడు.. గత కొన్నిరోజులుగా ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలను మేం ఫాలో అవుతున్నాం.. ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. అయితే చిరంజీవి ఈ పాట పాడింది.. రియల్గా కాదు.. రీల్ మీద. అర్థం కాలేదా.. అయితే ఇది చదవండి. సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి.. వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు. సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ రాంప్.. సెకండ్ ఆఫ్లో చిరు, రవితేజ ఇరగదీశారు.. అంటూ సినిమా చూస్తోన్న అభిమానులు.. ట్విట్టర్లో తమ రివ్యూ పోస్ట్ చేస్తున్నారు. సినిమా అదిరిపోయిందని.. బాస్ డ్యాన్స్, కామెడీ అన్ని అదుర్స్.. వాల్తేర్ వీరయ్య.. సూపర్ డూపర్ హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాలో ఓ సీన్లో చిరంజీవి.. జంబలకడి జారు మిఠాయి అంటూ పాడతాడు. అది చూసి ప్రేక్షకులు ఓ రేంజ్లో రచ్చ చేశారు. ఈ పాట మెగాస్టార్ను కూడా ఆకట్టుకుందా అని కామెంట్స్ చేస్తున్నారు. అది సోషల్ మీడియా పవర్ అంటే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై చిరంజీవి హీరోగా, రవితేజ మరో ప్రధాన పాత్రలో.. శ్రుతి హీరోయిన్గా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబి దర్శకత్వం వహించాడు. తొలి రోజు నుంచే హైప్ క్రియేట్ చేసిన సినిమా.. పాజిటివ్ టాక్తో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.
— Hardin (@hardintessa143) January 13, 2023