యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత.. విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు మందుకు వచ్చాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. విరూపాక్ష సినిమా హిట్ నేపథ్యంలో చిరంజీవి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
మెగాస్టార్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. విభిన్నమైన కథలు ఎన్నుకుంటూ.. కెరీర్లో ముందుకు సాగుతున్నాడు. సినిమాల్లో విజయవంతంగా రాణిస్తున్న సాయి ధరమ్ తేజ్ జీవితంలో అనుకోని కుదుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్కు గురై.. దాదాపు ఏడాది పాటు.. వెండితెరకు దూరమయ్యాడు సాయి ధరమ్ తేజ్. కోలుకున్న తర్వాత.. తాజాగా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను సాయి ధరమ్ తేజ్ నిలబెట్టాడు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతుంది. దాంతో సాయిధరమ్ తేజ్కు ఇండస్ట్రీని నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సైతం విరూపాక్ష విజయంపై సాయి ధరమ్ తేజ్కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
విరూపాక్ష సినిమా మంచి విజయం సాధించడంతో.. చిరు ఇంట్లో సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన ట్విట్టర్లో షేర్ చేశారు. తన భార్య సురేఖ.. సాయిధరమ్ తేజ్కు కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ యాడ్ చేశారు చిరంజీవి. ‘‘విరూపాక్ష గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి! సినిమా విజయం విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను డియర్ తేజు. నీ కమ్బ్యాక్ దద్దరిల్లింది. ఈ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విరూపాక్ష టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ మేరకు హీరోయిన్ సంయుక్త, డైరెక్టర్ కార్తిక్ వర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలిని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన విరూపాక్ష చిత్రంలో సంయుక్త మీనన్, సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద ‘విరూపాక్ష’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సాయిధరమ్కు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక యాక్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనకు ఎంత సపోర్ట్గా నిలిచారో.. విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు సాయి ధరమ్ తేజ్. కోలుకున్న తర్వాత షూటింగ్కు వచ్చినపుడు మాట్లాడేందుకు కష్టపడ్డానని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గాడిలో పడ్డానని చెప్పుకొచ్చాడు. తేజ్ కష్టం చూసిన మెగా అభిమానులు ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు. వారి ఆశలు ఫలించి సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది. మరి విరూపాక్ష సినిమా మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. 🤗Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! 💐💐@iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023