మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే.. ఆయన నటించిన అద్భుతమైన సినిమాలు, అందులో డైలాగ్స్, డ్యాన్సులే గుర్తొస్తాయి. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన.. బయట చాలా కంపోజ్డ్ గా ఉంటారు. ఎమోషన్స్ ఎన్ని వచ్చినా సరే తనలోనే దాచుకుంటారు తప్పించి, అభిమానుల ముందు చూపించారు. అలాంటి చిరు.. తాజాగా ఓ విషయం వినగానే కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోయారు. దీని గురించి ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యలో బయటపెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో హిట్ కొట్టిన చరణ్.. వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. అయితే కొన్నిరోజుల ముందు చరణ్-ఉపాసన దంపతులు.. తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇది మెగా ఫ్యాన్స్ కి చాలా సంతోషాన్నిచ్చింది. బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడని తెగ ఆనందపడిపోతున్నారు. అయితే ఉపాసన తల్లి కాబోతున్న విషయం తనకు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు ఎమోషన్స్ ని నియంత్రించుకోలేకపోయానని చిరు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘ఈ సందర్భం కోసం మేం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. రామ్ చరణ్, ఉపాసన.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు. ఆ టూర్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చారు. అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని ఇద్దరూ కలిసి మాకు చెప్పారు. ఆ వార్త విని నేను, సురేఖ చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం’ అని చిరు చెప్పారు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. సంక్రాంతి కానుకగా మరికొద్దిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. చిరు కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోవడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.