సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టర్గానే కాకుండా, బిజినెస్మెన్, ప్రొడ్యూసర్, బ్రాండ్ ప్రమోటర్గానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారి పాలిట దేవుడిగా మారాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టర్గానే కాకుండా, బిజినెస్మెన్, ప్రొడ్యూసర్, బ్రాండ్ ప్రమోటర్గానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారి పాలిట దేవుడిగా మారాడు. ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా చేసి, అవి విజయవంతం కావడంలో తన వంతు పాత్రను పోషించాడు. అయితే మహేష్ ప్రమోట్ చేసిన ఓ బ్రాండ్ విషయంలో ఇప్పుడు వివాదం నెలకొంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్త డబ్బు తీసుకుని మోసం చేశారంటూ అతని మీద కేసు నమోదైంది. ఈ సంస్థకు సంబంధించిన ప్రకటనల్లో మహేష్, భార్య నమ్రతతో పాటు పిల్లలు గౌతమ్, సితార కూడా నటించారు.
మధురా నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నక్క విష్ణు వర్ధన్ అనే వ్యక్తి తన సన్నిహితులు కొంత మందితో కలిసి సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్లో రూ.3 కోట్ల 21 లక్షల 34 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 2021 ఏప్రిల్ సమయంలో షాద్నగర్లో 14 ఎకరాల భూమి మీద ఈ పెట్టుబడి పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వెంచర్లో విష్ణు వర్ధన్, అతని స్నేహితులతో పాటు డాక్టర్ సుధాకర్ రావు, శ్రీకాకుళం విటల్ మహేష్, రాజేష్, శ్రీనాథ్, కె హరీష్, కోట్ల శశాంక్, సిహెచ్ రవి కుమార్, కె ప్రభావతి, వెంకట్ రావు, కృష్ణ మోహన్ కూడా పెట్టుబడులు పెట్టారు. (వ్యవసాయేతర భూమి) తనఖా ఫ్లాట్ల పేరుతో ఈ అగ్రిమెంట్ జరిగింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) నుండి అవసరమైన పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ప్లాట్స్ రిజిస్టర్ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడి పెట్టినట్టు విష్ణు వర్ధన్ అండ్ కో చెప్పారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ, కంపెనీ నుండి సరైన సమాచారం లేకపోవడం వల్ల పెట్టుబడి పెట్టిన వారందరికీ అనుమానం వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో విచారణ నిర్వహించగా.. వారి పెట్టుబడికి సంబంధించిన అన్ని మార్ట్గేజ్ ప్లాట్లు వారికి తెలియకుండా SRV & TNR ఇన్ఫ్రా-రాజారామ్ & VASGI వెంకటేష్ అనే ఫైనాన్షియర్ల పేర్ల మీదకు వెళ్లిపోయాయని తెలిసింది. దీంతో వారు షాక్ అయ్యారు.
సినీ నటుడు మహేష్ బాబు లాంటి వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడంతో ఎటువంటి మోసం జరగదు అని భావించి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న వీరు.. ప్రాజెక్ట్ సైట్కి వెళ్లి చూస్తే, అసలు అభివృద్ధి జరగలేదని, అవసరమైన అనుమతులు ఆశించిన విధంగా పొందలేదని తేలింది. ఈ అంశం మీద మధురా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 406, 420 కింద నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, మోసం చేశారని కంప్లైట్ చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.