వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీపడటం, సర్దుకుపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. అయితే దాని కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, ప్రైవసీకి ప్రాధాన్యత ఉన్నప్పుడే వైవాహిక బంధం పటిష్ఠంగా సాగుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు..! ఎప్పుడు ఎవరు ఒక్కటి అవుతారు.. ఎప్పుడెవరు విడిపోతారో చెప్పలేం..! ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం.!. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, కలిసికట్టుగా నూరేళ్ల జీవితం. కాని చాలా జంటల మధ్య సఖ్యత లోపించి మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి.
దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.అలా నాగార్జున, దగ్గుబాటి రామనాయుడు కూతురు లక్ష్మీ,అప్పట్లో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నందిని.. శరత్ బాబు రమాప్రభ, అలా ఎంతో మందో.. అయితే ఇటీవలే ప్రస్తుతం మాత్రం నాగచైతన్య, సమంత.. ఝాన్సీ, జోగినాయుడు,మంచు మనోజ్, ప్రణీత ఇలా వీళ్లందరు విడాకులు తీసుకున్నారు.. అలా తాజాగా బుల్లితెర నటి కూడా వీడాకులు తీసుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర నటి అసోపా చారు-నటి సుష్మీతా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ గతంలో కూడా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. అయితే ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ చివరకూ విడిపోవడానికే ఆసక్తి చూపారు. వీరిద్దరి మధ్య తేడాలు రావడం అనేది తప్పు చేసింది నువ్వు అని.. నువ్వు తప్పు చేసావని మరొకరు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కానీ.. వీళిద్దరి మధ్య పెద్దగా విడిపోవడానికి ఆసక్తికరమైన విషయం ఏం లేదు అని తెలుస్తుంది.
అలా ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరు నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు.అయితే తాజాగా కోర్టు ఈ జంటకు విడాకులకు ఒకే చెప్పేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా చట్టం ప్రకారంగా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో తన కూతురు కోసం స్నేహాపూర్వకంగా ఉందామని అనుకున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా రాజీవ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో చెప్పుకున్నాడు. ఈ మేరకు తన ఇన్ స్టా లో స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకున్నాడు రాజీవ్ సేన్. అయినప్పటికి మేము ఒకరికొకరు విడిపోయినా మా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడే మా కూతురికి అమ్మ, నాన్నలాగానే ఉంటాం అని.. పోస్ట్ చేశారు. దీనిపై ఇంకా చారు అసోపా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదా. అలా కాగా.. ఈ జంట జూన్ 9,2019 న గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021 లో వీళ్లు మెుదటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే తన కుమార్తెకు జియానా అని పేరు కూడా పెట్టారు.