సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ప్రతి విషయంలో తనదైన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన కామెంట్స్ తో వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి పాండవులు ఎవరు? కౌరవులు అంటే ఎవరు? ’అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ కాస్త పెద్ద వివాదంగా మారిపోయింది.
ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపతి ముర్ము పై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడం మంచిది కాదని.. ఈ నేపథ్యంలోనే ఆయనపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్మ ట్విట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022