ఆఫ్ఘనిస్థాన్లో అక్కడి ఆర్మీని జయించి వాళ్ల దగ్గర ఉన్న అమెరికా ఆయుధాలను సొంతం చేసుకున్నారు తాలిబన్లు. వీటి వల్ల ఇండియాకు ముప్పే అంటున్నారు ఆర్మీలోని సీనియర్ అధికారులు. ఆ ఆయుధాలతో మొదట పాకిస్థాన్లో భయానక వాతావరణం సృష్టించే తాలిబన్లు తర్వాత ఇండియాలోకి వాటిని అక్రమంగా తీసుకువచ్చే ప్రమాదం ఉన్నదని ఆ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల చేతుల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ విషయం లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహరిస్తున్న తీరు పై టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సీరియస్ అయ్యారు. చెప్పు తెగుద్ది ఎదవా అంటూ తీవ్ర స్థాయిలో నిఖిల్ దూషించారు.
అఫ్గానిస్తాన్ ను 21 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఈ దుస్థితి లో వదిలేశారు. ‘మిస్టర్ … జో బైడెన్ మరోసారి ‘ఫ్రీడమ్’ గురించి మాట్లాడితే తెగుద్ది ఎదవా” అంటూ హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్విట్ కు కొందరు వ్యతిరేకంగా స్పందిస్తుంటే మరి కొందరేమో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మన దేశంలో పెట్రోల్ రేట్లపై ప్రధాని మోడీ ని ప్రశ్నించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అఫ్ఘానిస్తాన్లో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాలిబన్ల భయానికి చాలా మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఆ దేశం లో తాలిబన్లు కఠిన నిబంధనలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో హీరో నిఖిల్ ట్వీట్ కి భారీ స్పందన లభిస్తోంది.
Only Example of the FREE WORLD… America…. gone…
21 years u tourbled a country… and…. abandoned it in this way..
Next time u talk abt freedom
Mister BIDEN @JoeBiden cheppu teguddi …. yedava— Nikhil Siddhartha (@actor_Nikhil) August 25, 2021