‘భీమ్లానాయక్’ మూవీ థియేటర్లలో ఇంకా దూసుకుపోతోంది. ఆరు రోజులకు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఆ సినిమా మేనియా ఇంకా ప్రేక్షకుల్లో తగ్గలేదు. రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్నా కూడా సోషల్ మీడియా మొత్తం పవన్ ఫీవర్ కొనసాగుతోంది. మరుగున పడిపోయిన కళలు, కళాకారులను పరిచయం చేయడంలో పవన్ ముందుంటారు. భీమ్లానాయక్ సినిమాతో ఆ విషయం మళ్లీ రుజువైంది. ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తే ఏ విధంగా ఆదరిస్తారనే విషయాన్ని భీమ్లానాయక్ సినిమాలో నటించిన ఎం.ఎస్.చౌదరి స్వయాన తెలియజేశాడు.
గబ్బర్ సింగ్ సినిమాతో ఎంఎస్ చౌదరికి పవన్ తో అనుబంధం ఏర్పడింది. ‘నేను ఇప్పటివరకు ఎవరన్నా పిలిచి ఈ క్యారెక్టర్ ఉంది చేయండి అంటేనే చేసేవాడిని. అజ్ఞాతవాసి సమయంలో పవన్ కల్యాణ్ నన్ను పిలిచి మాట్లాడారు. సినిమాలు ఎందుకు చేయట్లేదని కోప్పడ్డారు. నాకు అవకాశాలు రావట్లేదని చెప్పాను. ఈసారి నుంచి మా ప్రతి సినిమాలో మీరు ఉండాలి, చేయాలి అని చెప్పారు. హైదరాబాద్ లోనే ఉండండి.. ఎక్కడికి వెళ్లకండని వార్నింగ్ కూడా ఇచ్చారు’ అంటూ ఎంఎస్ చౌదరి పవన్ కల్యాణ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.