పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగిస్తోంది. విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో భీమ్లా నాయక్.. వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఫస్ట్ డే మాస్ ఫీస్ట్ క్రియేట్ చేసిన భీమ్లా నాయక్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ జోరు కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రెండు రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మాసివ్ కలెక్షన్స్ రాబట్టిన భీమ్లా నాయక్.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఇకపోతే.. ఏపీలో ఆంక్షలు, వివాదాల మధ్య కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది.ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38 కోట్ల గ్రాస్ , 27 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు.. భీమ్లా నాయక్ 20 కోట్లకు పైగా గ్రాస్, 14 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మూడవ రోజు భీమ్లా నాయక్.. 21 కోట్ల గ్రాస్, 13.5 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 రోజులకు 16 కోట్లకు పైగా వసూల్ చేసింది. మొత్తంగా మూడు రోజులకు కలిపి భీమ్లా నాయక్.. 72 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం విశేషం. మరి భీమ్లా నాయక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.