ఇది సోషల్ మీడియా యుగం. మీ ఫొటో, వీడియో ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. లేదంటే మీపై కౌంటర్స్ పడటం గ్యారంటీ. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే, వెతికి మరీ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇది కొంతకాలం నుంచి మరీ ఎక్కువైంది. వీళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా అస్సలు ఉండదు. దొరికిన వాళ్లను దొరికినట్లు ట్రోల్ చేస్తుంటారు. వేరే విషయం ఏమైనా కనిపిస్తే మాత్రం పాతదాని గురించి పట్టించుకోరు. అలా ఈ మధ్య కాలంలో బాగా ట్రోలింగ్ కి గురైన విషయం భాను పాట పాడటం. నెటిజన్స్ ఆమెని తెగ ఆడుకున్నారు. అస్సలు ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇప్పుడు వాళ్ల ఎఫెక్ట్ ఆమె పాటపై గట్టిగానే తగిలినట్లుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రియాలిటీ షోల ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఛానెల్ లోనూ వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రతి ఆదివారం టెలికాస్ట్ అయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోల తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన రియాలిటీ షో ఇది. ఇందులో కమెడియన్స్, సీరియల్ నటులు అందరూ కనిపిస్తుంటారు. స్కిట్స్ వేస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఫుల్ గా అలరిస్తుంటారు. అయితే నిన్న అంటే ఆదివారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ట్రోలర్స్ ఎఫెక్ట్ వల్ల ఓ పాటనే లేపేశారు. ఈ విషయాన్ని నెటిజన్స్ గుర్తించి మరీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే భాను.. తీన్ మార్ సినిమాలోని ‘గెలుపు తలుపులే’ సాంగ్ పాడింది. ఆమె వాయిస్ లో బేస్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ఆమెని ట్రోల్ చేస్తూ పలువురు పోస్టులు పెట్టారు. ‘వద్దు… పాడటం ఆపేయ్’ లాంటి కామెంట్స్ కూడా పలువురు నెటిజన్స్ పెట్టారు. దీంతో షో నిర్వహకులు ఆలోచనలో పడిపోయినట్లు కనిపించారు. అందులో భాగంగా తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఆ సాంగ్ ని కేవలం 8 సెకన్లు మాత్రమే చూపించారు. అదే టైంలో భాను పాడిన ‘అటు నువ్వే ఇటు నువ్వే’ సాంగ్ ని మాత్రం చూపించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న నెటిజన్స్.. ట్రోలర్స్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది అని డిస్కస్ చేస్తున్నారు.