సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దర్శకుడు విశ్వనాథ్, నటి జమున, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న, తమిళ కమెడియన్ మయిల్ స్వామి, మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్, సినిమాట్రోగఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందారు. తాజాగా మరో ప్రముఖ నటి ఇంట్లో విషాదం నెలకొంది.
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అనేక మంది ప్రముఖులు మృతి చెందారు. ఈ ఏడాది మూడు నెలలు కూడా గడవక ముందే అనేక మంది మరణించారు. దర్శకుడు విశ్వనాథ్, నటి జమున, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న, తమిళ కమెడియన్ మయిల్ స్వామి, మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు సినిమాట్రోగఫీ చేసిన ప్రవీణ్ అనుమోలు, తాజాగా బాలీవుడ్ దర్శకుడు సతీశ్ కౌశిక్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ ఒకప్పటి అగ్ర నటి మాధురి దీక్షిత్ తల్లి ఇటీవల మరణించగా.. ఇప్పుడు మరో నటి సోదరి మృతి చెందారు.
ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కేండేయ అనుమానాస్పద మృతిలో కన్నుమూశారు. ఆమె మృతదేహాన్నిపూణేలోని పింప్రి-చించ్వాడ్లోని వాకాడ్లో లభ్యమైంది. ఆమె ముఖంపై గాయాలున్నాయి. ఆమె ఓ బేకరీని నడుపుతున్నారు. తన వ్యాపార పనుల నిమిత్తం ఓ గది అద్దెకు తీసుకునేందుకు వెళ్లిన ఆమె.. అక్కడ ఒక్కసారిగా తలతిరిగి పడిపోయారు. ఆమె వెంట ఉన్న స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే మధు కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంటల్ డెత్గా తేల్చారు. కేసు నమోదు చేశామని తదుపరి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. అయితే మధు భర్త కూడా నెల రోజుల క్రితం ఆకస్మాత్తుగా చనిపోయారు. అంతలోనే సోదరి మరణం నటిని మరింత కుంగదీసింది.
తన సోదరి మరణంపై నటి భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు. ఇన్ స్టా వేదికగా తన సోదరిని తలుచుకుంటూ పలు పోస్టులు పెట్టారు. ‘నన్ను వదిలేసి ఎలా వెళ్లగలిగావ్. నువ్వు నా జీవితంలో భాగం. ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నీ బేబీ అన్ని చూసుకుంటుంది’అంటూ చనిపోయిన విషయాన్ని చెప్పారు. ‘ప్రియ సోదరి ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికావ్. నీ గురించి నేను మాటల్లో వర్ణించలేను. సోదరిగా కాకుండా తల్లి, స్నేహితురాలివి అయ్యావ్. నా జీవితానికి నువ్వే పునాది. నువ్వు లేకుండా నేను లేను. నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. నువ్వు కూడా నేర్పలేదు. మరణం అనివార్యమని తెలిసినా.. నిన్ను మర్చిపోవడం సాధ్యం కాదూ ఎప్పటికీ’ అంటూ ఎమోషనల్ అయ్యారు. భాగ్యశ్రీ మోటే సీరియల్స్, సినిమాలు చేశారు. హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’అనే సినిమాలో నటించారు.