పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వెర్రెక్కిపోయే వీరాభిమానులు ఎంతోమంది ఉన్నా.. వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా బండ్ల నుండి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల స్పీచ్ హవా మాములుగా ఉండదు. బండ్ల గణేష్ స్పీచ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం.
ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వాయిస్ తో ఓ ఆడియో టేప్(కాల్ రికార్డు) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నన్ను పిలవలేదని, త్రివిక్రమ్ కావాలనే నన్ను రాకుండా అడ్డుకున్నాడంటూ.. బండ్ల వాయిస్ తో సంభాషణ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పవన్ కళ్యాణ్ ని దైవంగా భావించే బండ్ల ఇలా చేశాడేంటా? అని అంతా షాకయ్యారు.తాజాగా ఈ లీకైన ఆడియో క్లిప్పై ఓ ప్రముఖ ఛానల్ కు బండ్ల గణేష్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఆడియో టేప్ లో వాయిస్ తనది కాదని, ఫేక్ ఆడియో అని.. ఎవరో క్రియేట్ చేసిందని.. అలాగే ఈ విషయంపై తాను మాట్లాడాలని అనుకోవట్లేదంటూ బండ్ల కొట్టిపారేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మరి బండ్లని ఎవరు టార్గెట్ చేశారు? అనే విషయం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హంక్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. ఇటీవలే సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న జరగబోతుంది. మరి ఆడియో లీక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.