నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటాడు బండ్ల గణేష్. ఇక గత కొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారాడు బండ్ల గణేష్. తరచుగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం.. దానిపై ట్రోలింగ్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం.. పూరి జగన్నాథ్ గురించి కామెంట్స్ చేసి ట్రోలింగ్కు గురయ్యాడు. ఇక తాజాగా అల్లు బ్రదర్స్పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన వారు.. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివాదం వివరాలు..
బండ్ల గణేష్ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ని హాజరయ్యాడు. అల్లు బాబీ కూడా ఈ వేడకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బాబీతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు బండ్ల గణేష్. అక్కడితే ఆగితే బాగుండేది కానీ.. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బాబీతో కలిసి ఫోటోకు ఫోజులిచ్చిన తర్వాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘మీ అందరికి చెప్తున్నాను.. తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించవద్దు. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే.. మీ ముందే ఒక ఉదాహరణ ఉంది చూడండి’’ అన్నాడు.
‘‘అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబీ.. తండ్రి మాట విని.. బుద్ధిగా చదవుకున్నాడు. అదే అల్లు అర్జున్.. తండ్రి మాట వినకుండా.. తనకు ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ ముందుకు పోయాడు. నేడు పాన్ ఇండయా స్టార్గా ఎదిగాడు. అందుకే చెబుతున్నాను. తండ్రి మాట వినవద్దు.. మీకు నచ్చినట్లు సొంత నిర్ణయం తీసుకొండి. తండ్రి మాట వింటే బాబీలా అవుతారు.. వినకపోతే.. బన్నీలా మారతారు. మరి మీరు ఎవరిలా అవుతారో.. మీరే నిర్ణయం చేసుకొండి’’ అన్నాడు.
ఈ మాటలు విన్న బాబీ.. సరదాగానే తీసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీన్ని చూసిన అల్లు ఫ్యాన్స్, నెటిజనులు.. ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు తెలియదా.. కాస్త అయినా బుద్ధి ఉండాలి కదా.. నోటి దురుసును తగ్గించుకుంటే మంచిది. ఒకరిని ఇలా కించపరుస్తూ.. మాట్లాడితే.. నీకు ఏం వస్తుంది.. అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేయసాగారు.